జగన్‌ నిరంకుశ పాలనకు చెంపపెట్టు

ABN , First Publish Date - 2020-05-23T10:36:31+05:30 IST

ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరంకుశ పాలనకు హైకో ర్టు తీర్పు చెంప పెట్టు అని

జగన్‌ నిరంకుశ పాలనకు చెంపపెట్టు

డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నాం.. 

టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు


అనంతపురం, మే 22 (ఆంధ్రజ్యోతి) :  ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరంకుశ పాలనకు హైకో ర్టు తీర్పు చెంప పెట్టు అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్య క్షుడు ఎంఎస్‌ రాజు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. డాక్టర్‌ సుధాకర్‌ కేసును హైకోర్టు సీబీఐకి అప్ప గించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో దళితుల అణిచివేత జరుగుతోందని మొదట్నుంచి తాను చెబుతూనే ఉన్నానని ఈ సందర్భంగా వివరించారు. జగ న్మోహన్‌రెడ్డి పాలనలో మానవహక్కులపై దాడి జరుగుతోందన్నారు. మాస్కులు లేవని అడిగిన పాపానికి ప్రభుత్వం డాక్టర్‌ సుధాకర్‌పై దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. డాక్టర్‌పై దాడిచేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో  పోలీసులు కూడా జగన్‌, వైసీపీ నేతల ఒత్తిడితో కాకుండా చట్టం పరిధిలో నడుచుకోవాల్సిన అవస రం ఉందన్నారు.  పోలీసు వ్యవస్థను దు ర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-05-23T10:36:31+05:30 IST