నిరంతరం అందుబాటులో ఉంటాం

ABN , First Publish Date - 2022-01-18T05:18:35+05:30 IST

ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, నిరంతరం అందుబాటులో వుంటామని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు.

నిరంతరం అందుబాటులో ఉంటాం
కార్యక్రమంలో మాట్లాడుతున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌

ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌

పెదవాల్తేరు, జనవరి 17: ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, నిరంతరం అందుబాటులో వుంటామని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం పాండురంగాపురం పార్కులో ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు స్థానిక నాయకులతో సత్సంబంధాలు మెరుగుపడినప్పుడే ఆయా ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చినవాల్తేరు, సీబీఐ డౌన్‌, డిఫెన్స్‌ క్వార్టర్స్‌, లాసన్స్‌బే కాలనీ ప్రాంతాలకు చెందిన కమిటీ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్సీకి, కార్పొరేటర్లకు వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో 19, 20, 27 వార్డులకు చెందిన కార్పొరేటర్లు నొల్లి నూకరత్న, లక్ష్మీ సురేశ్‌, వీరారావు, అసోసియేషన్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T05:18:35+05:30 IST