ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం: పద్మావతిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-25T05:36:07+05:30 IST

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి అన్నారు. అనంతగిరి, మఠంపల్లి మండల కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు.

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం: పద్మావతిరెడ్డి
అనంతగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి

అనంతగిరి / మఠంపల్లి / కోదాడ టౌన్‌, అక్టోబరు 24 : ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి అన్నారు. అనంతగిరి, మఠంపల్లి మండల కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. కోదాడలో జరిగే కాంగ్రె్‌సపార్టీ సమ్మేళనాన్ని కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. అనంతగిరి గ్రామశాఖ అధ్యక్షుడు నకిరేకంటి సత్యానందంతో ప్రమాణస్వీకారం చేయించారు. పద్మావతి సమక్షంలో వివిధ పార్టీ నాయకులు కాంగ్రె్‌సపార్టీలో చేరారు. అంతకుముందు డేగ కొండయ్య ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివా్‌సరెడ్డి, గౌరవాధ్యక్షుడు కొండపల్లి వాసు, చనుపల్లి సర్పంచ్‌ గురవయ్య, మాదాసు రాంబాబు, బాబునాయక్‌, సైదులు, అంతయ్య పాల్గొన్నారు. మఠంపల్లి సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు భూక్య మంజూనాయక్‌, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నవీన్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ బాబునాయక్‌, మైనార్టీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కరీం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంటిపులి శ్రీనివాస్‌, ఎంఎంయాదవ్‌, చిలక గురవయ్య, మాజీ జడ్పీటీసీ సింగారపు అరుణసైదులు, నిజాం, అచ్చయ్య, సకృనాయక్‌, పిచ్చిరెడ్డి, సర్పంచ్‌ గోవందునాయక్‌, నాగరాజు, శ్రీనివాస్‌, ఎల్లారెడ్డి, హనుమానాయక్‌, పాల్గొన్నారు. 

ఏర్పాట్ల పరిశీలన 

కోదాడటౌన్‌: పట్టణంలో ఈ నెల 25న నిర్వహించనున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఆదివారం పరిశీలించారు. పార్టీ శ్రుణులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, పార సీతయ్య, శ్రీధర్‌, బషీర్‌, మాతంగి బసవయ్య, సైదాబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T05:36:07+05:30 IST