ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2021-06-20T04:37:11+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి వై ద్యాధికారి చందూనాయక్‌ అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం
బాలింతతో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌

- జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి చందూనాయక్‌ 

ఆత్మకూరు, జూన్‌ 19: ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి వై ద్యాధికారి చందూనాయక్‌ అన్నారు. శనివారం డీఐవో సౌభాగ్యలక్ష్మి, డీపీహెచ్‌వో రవిశం కర్‌తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. వార్డులో గర్భిణీ, బాలింతల ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. శిథిలావస్థకు చేరుకు న్న భవనాలకు తక్షణమే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ కొరత ఉందని, త్వరలోనే ఆ పోస్టును భర్తీ చేయిస్తానన్నారు.  కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు చందూలాల్‌, నిసార్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌చౌదరి, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:37:11+05:30 IST