గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం: చాడ వెంకటరెడ్డి

ABN , First Publish Date - 2021-12-27T21:50:59+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు వెన్నంటే ఉండి పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం: చాడ వెంకటరెడ్డి

సిద్దిపేట: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే వరకు వెన్నంటే ఉండి పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గౌరవెల్లి  ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందన్నారు. బాధితులకు పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడిన నిర్వాసితులపై లాఠీఛార్జ్ చెయ్యడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే నిర్వాసితుల దీక్ష వద్దకు రావాలి సమస్యను పరిష్కరించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-27T21:50:59+05:30 IST