నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తాం

ABN , First Publish Date - 2021-01-21T06:12:25+05:30 IST

నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు.

నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తాం
సంపతిపురంలో పట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే అమర్‌

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌


అనకాపల్లి రూరల్‌/తుమ్మపాల: నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. మండలంలోని సంపతిపురం, వేటజంగాలపాలెం, వెంకుపాలెం, సీతానగరం, తుమ్మపాల, దిబ్బపాలెం, బవులవాడ, మాటూరు, ఉడేరు గ్రామాల్లో బుధవారం పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, వైసీపీ మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, నాయకులు దిలీప్‌కుమార్‌, పల్లా శ్రీను పాల్గొన్నారు.


రాజకీయాలకు అతీతంగా ఇళ్ల పట్టాలు: రత్నాకర్‌


అనకాపల్లి టౌన్‌: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని వైసీపీ నాయకుడు దాడి రత్నాకర్‌ అన్నారు. పెదరామస్వామి ఆలయం వద్ద కార్పొరేట్‌ అభ్యర్థిని కొణతాల నీలిమ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారు. కార్యక్రమంలో నాయకులు దాడి జయవీర్‌, కొణతాల భాస్కరరావు, మళ్ల రాజా పాల్గొన్నారు. అలాగే 83వ వార్డులో వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో పట్టాలు పంపిణీ చేశారు. వైసీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు జాజుల రమేశ్‌, కార్పొరేట్‌ అభ్యర్థిని ప్రసన్నలక్ష్మి, నాయకులు వి.రాజాసతీశ్‌, కె.రాఘవ, ఎస్‌.కనకారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:12:25+05:30 IST