జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుపుతాం
ABN , First Publish Date - 2021-07-29T05:12:45+05:30 IST
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిల్పుతామని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. నూతన కలెక్టర్గా నియమితులైన ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని
సీఎం సొంత జిల్లాలో పనిచేయడం అదృష్టం
నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు
కడప(కలెక్టరేట్), జూలై 28: అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిల్పుతామని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. నూతన కలెక్టర్గా నియమితులైన ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని తన చాంబరులో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, ప్రజల సహకారం సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిల్పుతామన్నారు. ఇక్కడ సమర్థవంతమైన అధికారులు ఉన్నారన్నారు. కొవిడ్ రెండవ దశ తగ్గుముఖం పట్టిందన్నారు. అలాగని నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరగదన్నారు. కొవిడ్ ప్రోటోకాల్ మేరకు జాగ్రత్తలు పాటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ చేపట్టిన , చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు నూతన కలెక్టర్ విజయరామరాజుకు జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి, సీఎం సాయికాంత వర్మ, ధర్మచంద్రారెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి మలోల పూలమొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ బాధ్యతలు చేపట్టగానే వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.