అమరావతిని కాపాడుకుంటాం
ABN , First Publish Date - 2020-05-28T11:44:48+05:30 IST
ప్రజా పోరుతో పాటు, న్యాయ పోరాటం చేస్తూ అమరావతిని కాపాడుకుంటామని రాజధాని రైతులు
- మా త్యాగాలను అవహేళన చేయొద్దు
- 162వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతుల ఆవేదన
గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 27: ప్రజా పోరుతో పాటు, న్యాయ పోరాటం చేస్తూ అమరావతిని కాపాడుకుంటామని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ చేస్తున్న ఆందోళనలు బుధవారానికి 162వ రోజుకు చేరాయి. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంటింటా అమరావతి పేరుతో ఎవరి ఇళ్లలో వారు 29 గ్రామాల్లో రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం బంగారం పండే పొలాలను త్యాగం చేస్తే, తమ త్యాగాలను గుర్తించకపోగా అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు చేస్తున్న నిరసనలు బుధవారం నాటికి 35 రోజుకు చేరుకున్నాయి.