ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ కేంద్రం అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తాం

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి స్ర్తీ నిధి, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఫండ్‌ ద్వా రా రుణాలు మంజూరు చేస్తా మని గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్‌ చరణ్‌దాస్‌ అన్నారు.

ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ కేంద్రం అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తాం

బోథ్‌ రూరల్‌, మే7: ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి స్ర్తీ నిధి, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఫండ్‌ ద్వా రా రుణాలు మంజూరు చేస్తా మని గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్‌ చరణ్‌దాస్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని కౌఠ-బి గ్రామం లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న కేక్‌, బిస్కెట్‌ ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ కేంద్రాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్‌ చరణ్‌దాస్‌, జిల్లా మేనేజర్‌ గంగన్న, డీపీఎం సుగంద పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులను ముడిసరుకులకు కావాల్సిన పెట్టుబడి, నెలకు వస్తున్న అదాయం, ఖర్చు తదితర వివరా లను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో సీసీ సుభద్ర, అశోక్‌ వర్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST