ఫుడ్ ప్రాసెస్సింగ్ కేంద్రం అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తాం
ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST
ఫుడ్ ప్రాసెస్సింగ్ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి స్ర్తీ నిధి, ఎన్ఆర్ఎల్ఎం ఫండ్ ద్వా రా రుణాలు మంజూరు చేస్తా మని గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ చరణ్దాస్ అన్నారు.
బోథ్ రూరల్, మే7: ఫుడ్ ప్రాసెస్సింగ్ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి స్ర్తీ నిధి, ఎన్ఆర్ఎల్ఎం ఫండ్ ద్వా రా రుణాలు మంజూరు చేస్తా మని గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ చరణ్దాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని కౌఠ-బి గ్రామం లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న కేక్, బిస్కెట్ ఫుడ్ ప్రాసెస్సింగ్ కేంద్రాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ చరణ్దాస్, జిల్లా మేనేజర్ గంగన్న, డీపీఎం సుగంద పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులను ముడిసరుకులకు కావాల్సిన పెట్టుబడి, నెలకు వస్తున్న అదాయం, ఖర్చు తదితర వివరా లను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో సీసీ సుభద్ర, అశోక్ వర్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.