సీహెచ్సీలో సమస్యలు పరిష్కరిస్తాం
ABN , First Publish Date - 2021-10-24T05:14:32+05:30 IST
సీహెచ్సీలో సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీవో బి.నవ్య తెలిపారు. శనివారం సీతం పేట సీహెచ్సీలో పరిశీలించారు.
సీతంపేట: సీహెచ్సీలో సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీవో బి.నవ్య తెలిపారు. శనివారం సీతం పేట సీహెచ్సీలో పరిశీలించారు. మత్తు వైద్యుడ్ని నియమించాలని, ఎక్స్రే యంత్రం మూడేళ్లుగా వృఽథాగా పడి ఉండడంతో టెక్నీ షియన్ను నియమించాలని ఆసుపత్రి సూపరిం టెండెంట్ నరేష్కుమార్ పీవో దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్తో మాట్లాడి మత్తు వైద్యుడ్ని నియమించడానికి చర్యలు తీసు కుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు సునీల్కుమార్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఫవెలుగు ఆధ్వర్యంలో గిరిజన మహిళలు తయారుచేస్తున్న అగర బత్తీలు, పసుపు తయారీ ఉత్పత్తిని పెంచాలని ఐటీడీఏ పీవో బి.నవ్య కోరారు. శనివారం సీతంపేటలోనీ వీడీవీకే కేంద్రా లను పరిశీలిం చారు. ఆమె వెంట ఇన్చార్జి ఏపీడీ నారాయ ణరావు, జీసీసీ మేనేజర్ జి.నర్సింహులు ఉన్నారు.