గిరిజన సమస్యలు పరిష్కరిస్తాం
ABN , First Publish Date - 2021-01-26T05:43:10+05:30 IST
గిరిజన గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు.
పార్వతీపురం రూరల్, జనవరి 25: గిరిజన గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సోమవారం మండలంలోని బుదురువాడ పంచాయతీ టేకులోవ గిరిజన గ్రామాన్ని కాలి నడకన వెళ్లి పర్యటించారు. వారితో కలిసి కొండ కోనల వైపు నడుచుకుంటూ మైళ్ల దూరం ప్రయాణించి చెక్డ్యాంను పరి శీలించారు. చెక్డ్యాం ఎత్తు పెంచి సాగునీరు పంట పొలాలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికోసం సంబంధి త అధికారులతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయిం చి సకాలంలో పనులు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదిత రు లు పాల్గొన్నారు. ఫ అనంతరం ఉపహార ఎన్జీవో సంస్థ సమకూర్చిన చీరలు, లుంగీలను టేకులోవ గ్రామంలో 90 మంది వితంతువులకు, వృద్ధులకు పంపిణీచేశారు. అనంతరం గిరిజన మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 500లు చొప్పున 100 మందికి తన సొంత డబ్బులు అందించారు. 50 మంది మహిళలకు తన సొంత నిధులతో చీరలు పంపిణీ చేశారు.