వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

ABN , First Publish Date - 2020-05-30T12:08:26+05:30 IST

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

అమరావతి:  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నే య అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్‌ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో పలుచోట్ల వాతావరణ అనిశ్చితి ఏర్పడి క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించాయి. దీంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

Updated Date - 2020-05-30T12:08:26+05:30 IST