సాగర్‌ కాలువలోకి దూకి నేత కార్మికుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-02T07:19:57+05:30 IST

మండలంలోని వలపర్ల గ్రామ సమీపంలోని సాగర్‌ కాలువలోకి నేత కార్మికుడు అడిగోపుల లక్ష్మీనారాయణ (48) సోమవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సాగర్‌ కాలువలోకి దూకి నేత కార్మికుడి ఆత్మహత్య

మార్టూరు, మార్చి 1 : మండలంలోని వలపర్ల గ్రామ సమీపంలోని సాగర్‌ కాలువలోకి నేత కార్మికుడు అడిగోపుల లక్ష్మీనారాయణ (48) సోమవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, గ్రామ వలంటీరుగా పనిచేస్తున్న కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... రెండేళ్ల నుంచి లక్ష్మీనారాయణ అనారోగ్యంగా ఉన్నారు. అతను సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైకిల్‌ తీసుకొని ఆంజనేయస్వామి గుడిసమీపంలోని సాగర్‌ కాలువ వద్దకు వచ్చి అందులో దూకాడు. కాలువ గట్టున ఉన్న సైకిల్‌, తండ్రి చెప్పులను కుమార్తె శ్రీలక్ష్మి గుర్తించింది. కొంతమంది యువకులు కాలువలో గాలించగా మృతుని లుంగీ కనిపించింది. మృతదేహం లభ్యంకాకపోవడంతో  రెవెన్యూ సిబ్బంది, పోలీసులు రామకూరు బ్రిడ్జి వద్ద కాలువలో వలలు వేసి గాలిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు మృతదేహం కనిపించలేదని పంచాయతీ కార్యదర్శి షేక్‌ రవూఫ్‌ ఖాన్‌ చెప్పారు.

Updated Date - 2021-03-02T07:19:57+05:30 IST