ఏపీసీసీ అధ్యక్షుడి కుమారుడి పెళ్లికి ప్రముఖులు
ABN , First Publish Date - 2021-08-27T00:11:45+05:30 IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మేఫేర్ పంక్షన్ హాల్లో గురువారం ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్-డాక్టర్ మోక్షప్రసూన దంపతుల
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మేఫేర్ పంక్షన్ హాల్లో గురువారం ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్-డాక్టర్ మోక్షప్రసూన దంపతుల ఏకైక కుమారుడు డాక్టర్ రుత్విక్హృదయ్ వివాహం హైదరాబాద్కు చెందిన డాక్టర్ తరుణి-డాక్టర్ సాథే రాజ్కుమార్ దంపతుల ఏకైక కుమార్తె డాక్టర్ కీర్తనతో గురువారం జరిగింది. ఈ వివాహానికి మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రముఖులు, పలువురు అధికారులు, అనధికారులు హాజరయ్యారు.