సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం
ABN , First Publish Date - 2021-06-19T06:19:12+05:30 IST
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి శ్రీశైలం దర్శనానికి కుంటుంబ సమేతంగా వెళ్తున్న ఎన్వీ రమణకు శుక్రవారం మన్ననూరు వద్ద ఘన స్వాగతం లభించింది.
శ్రీశైలం వెళ్తూ మన్ననూరు వద్ద ఆగిన జడ్జి
తేనీటి విందు స్వీకరణ
అచ్చంపేట/అమ్రాబాద్, జూన్ 18: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి శ్రీశైలం దర్శనానికి కుంటుంబ సమేతంగా వెళ్తున్న ఎన్వీ రమణకు శుక్రవారం మన్ననూరు వద్ద ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న ఆయన మన్ననూర్ అటవీశాఖ గౌస్ట్హౌస్ వద్ద విశాంత్రి తీసుకునేందుకు ఆగారు. అక్కడ తేనీటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయి శేఖర్, డీఎఫ్వో కిష్ట్ర గౌడ్, జూనియర్ సివిల్ జడ్జి చైతన్యశ్రీ, డీఎస్పీ నర్సింహు లు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అటవీ శాఖ అధికారులు మొక్కను బహూకరించారు. అచ్చంపేట బార్ కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలపై రమణకు వినతి పత్రం అందించారు. విశ్రాంతి అనంతరం ఎన్వీ రమణ శ్రీశైలం వెళ్లారు.