రైల్వే మంత్రికి సాదర స్వాగతం
ABN , First Publish Date - 2021-06-13T06:37:10+05:30 IST
కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు శనివారం తిరుపతి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
రేణిగుంట/తిరుపతి(కొర్లగుంట), జూన్ 12: కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు శనివారం తిరుపతి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విమానాశ్రయం చేరుకోగా.. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూధన్రెడ్డి, ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, సత్యనారాయణ, రైల్వే జీఎం గజానన మాల్యా, డీఆర్ఎం అలోక్తివారి, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక వాహనంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసి.. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొని, తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30గంటలకు విమానంలో తిరుగు ప్రయాణమవుతారు.