అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2020-06-03T10:15:21+05:30 IST
నేతన్న నేస్తం, వాహన మిత్ర పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని
ప్రొద్దుటూరు, జూన్ 2: నేతన్న నేస్తం, వాహన మిత్ర పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) రవికాంత్ వర్మ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ము న్సిపల్ కార్యాలయంకు వచ్చి, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఈ సం దర్భంగా పురపాలక పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఏ దశలో ఉన్నాయనే వాటిపై మున్సిపల్ కమిషనర్ రాధను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతన్న నేస్తం, వాహనమిత్ర లబ్ధి దారుల వివరాలను తెలుసుకునే నిమిత్తం క్షేత్రస్థాయిలో ఆ పథకాల లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి, వారి స్థితిగతులను, చేనేత మగ్గాలను పరిశీలించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి వివరించారు. పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ రాధ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.