వైఎస్సార్‌ పాలనలోనే సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-09-03T06:04:20+05:30 IST

వైఎస్సార్‌ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు.

వైఎస్సార్‌ పాలనలోనే సంక్షేమ ఫలాలు
నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ నాయకులు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 2: వైఎస్సార్‌ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో శుక్రవారం ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరై వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. వైఎస్సాఆర్‌ సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను అమలు చేయడం ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. ఏక కాలంలో లక్ష రుపాయలు రుణమాఫీ చేసిన రైతు బాంధవుడు వైస్‌ రాజశేఖర్‌రెడ్డి అ ని వివరించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చి, ప్రైవేటు ఆ సుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు చేసి నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అం దించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్‌రెడ్డి అని వివరించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ ఆర్గనై జింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, టీపీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మ న్‌ గిరి నాగ భూషణం, జిల్లా మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, జిల్లా యువజన కాం గ్రెస్‌ అధ్యక్షుడు గుండ మధు, ప్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, నాయకు లు రాజేందర్‌, శ్రీనివాస్‌, సుమ, శోభారాణి, నేహాల్‌, జీవన్‌ ఉన్నారు.

Updated Date - 2022-09-03T06:04:20+05:30 IST