అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2020-05-31T11:49:16+05:30 IST
ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో రైతు
- రైతుభరోసా కేంద్రాల ప్రారంభంలో బాచిన కృష్ణచైతన ్య
అద్దంకి, మే 30 : ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాచిన చెంచు ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ భువనేశ్వరి, సంతమాగులూరు ఏఎంసీ వైస్ చైర్మన్ చింతల పేరయ్య, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, అవిశన ప్రభాకరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏడీఏ ధనరాజ్, ఏవో వెంకటకృష్ణ, హెచ్వో ఆదిరెడ్డి, తహసీల్దార్ సీతారామయ్య, ఎంపీడీవో రాజేందర్, పశువైద్యశాల ఏడీ మోహనరావు, ఏఎంసీ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే పంగులూరు, బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం, సంతమాగులూరు మండలంలో 20 రైతు భరోసా కేంద్రాలను బాచిన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అట్ల పెద వెంకటరెడ్డి చైతన్యను ఘనంగా సన్మానించారు.