సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-10-24T04:21:32+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్ళాలని, టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విశతాబ్ది విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
దండపల్లి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, అక్టోబరు 23: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్ళాలని, టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విశతాబ్ది విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు  పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈనెల 27న నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్య క్షుడు పల్లపు తిరుపతి, బీసీసెల్‌ నాయకుడు రాజలింగు, గాద సత్యం, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

దండేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథ కాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నా రు. పద్మశాలి భవనంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విసృత్తస్ధాయి సమా వేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాల ను అమలు చేశారన్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు లిం గన్న,  సురేష్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌, మండలఅధ్యక్షకార్యదర్శు లు శ్రీనివాస్‌, వెంకటేష్‌ ఉన్నారు. 

 

Updated Date - 2021-10-24T04:21:32+05:30 IST