సంక్షేమ పఽథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-20T04:37:35+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గజ్జల సాయిలు అన్నారు.
మిరుదొడ్డి, అక్టోబరు 19: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గజ్జల సాయిలు అన్నారు. మంగళవారం మిరుదొడ్డిలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్తులూ్పపోల్స్ తీగలను సరిచేయాలని కోరుతూ ఏఈకి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ మల్లేశంగౌడ్,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్రాజు, ఆయాగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు లింగం, భూపతిగౌడ్ పాల్గొన్నారు.