కుటుంబ సభ్యుల చెంతకు పశ్చిమబెంగాల్ మహిళ
ABN , First Publish Date - 2022-01-24T06:26:54+05:30 IST
టీఎస్సార్ కాంప్లెక్స్లోని ఏయూ టీడీ, నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న పార్వతి (48) అనే మహిళను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు, వసతి గృహం మేనేజర్ కె.జ్యోతిర్మయి తెలిపారు.
పదిహేనేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి విశాఖకు
ఆర్టీసీ కాంప్లెక్ వద్ద తిరుగుతుండగా ఏయూటీడీలో ఆశ్రయం
కోలుకోవడంతో కుటుంబ సభ్యుల గుర్తింపు
విశాఖపట్నం, జనవరి 23 : టీఎస్సార్ కాంప్లెక్స్లోని ఏయూ టీడీ, నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న పార్వతి (48) అనే మహిళను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు, వసతి గృహం మేనేజర్ కె.జ్యోతిర్మయి తెలిపారు. మతిస్థిమితం లేని పార్వతి 2015లో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో తిరుగుతుండగా చేరదీశామని, చికిత్స చేయించడంతో కోలుకుందన్నారు.
గతం గుర్తుకు వచ్చినప్పుడల్లా భర్త పేరు నేపాల మిస్బా అని, తర్వాత ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిందన్నారు. ఆమె కుటుం బం పశ్చిమబెంగాల్లోని బర్దమాన్ జిల్లాలోని హట్గోబింద్పూర్ గ్రామంలో ఉందని తెలు సుకుని వారికి సమాచారం అందించామని, చనిపోయిందనుకున్న పార్వతి పదిహేనేళ్ల తర్వాత తిరిగి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందపరవశులయ్యారని తెలిపారు. పార్వతి కుటుంబ సభ్యులు ఏయూటీడీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.