కొవ్వూరు 23వ వార్డులో TDP గెలుపు

ABN , First Publish Date - 2021-11-17T15:07:43+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలుపొందింది.

కొవ్వూరు 23వ వార్డులో TDP గెలుపు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి మురుకొండ రమాదేవి 727 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. కొవ్వూరు 23వ వార్డులో మొత్తం 943 ఓట్లు పోలవగా... టీడీపీకి 828 ఓట్లు, బీజేపీకి 99 ఓట్లు, సీపీఐకి ఆరు ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి  వీరబాబుకి కేవలం ఒక ఓటు మాత్రమే వచ్చింది. కాగా ఈ వార్డులో పరస్పర అవగాహనలో భాగంగా వైసీపీ పోటీలో నిలువలేదు. 

Updated Date - 2021-11-17T15:07:43+05:30 IST