పశ్చిమగోదావరి జిల్లాలో ఘరానా మోసం
ABN , First Publish Date - 2020-09-24T18:38:02+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లు పేరుతో రామలింగేశ్వర రైస్ మిల్లు యాజమాన్యం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. రైస్ మిల్లు పేరుతో ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డిపాజిట్లను సేకరించి... మిల్లు యాజమాన్యం బోర్డు తిప్పేసింది. సుమారు రూ.22 కోట్లకు టోకరా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు, డిపాజిట్ దారులు ఆందోళన వ్యక్తం చేశారు.