మత్తులోనే.. మరలిరానిలోకాలకు

ABN , First Publish Date - 2021-02-25T05:07:55+05:30 IST

అప్పటి వరకూ సాఫీగా సాగిపో తున్న ప్రమాదం.. అనుకోకుండా ఒక్క కుదుపు.. కళ్లు తెరిచేలోపే ఇద్దరు సజీ వంగా దూరమైన సంఘ టన ఉం గుటూరు మండలం నారాయణపురం వద్ద బుధవారం జరిగింది.

మత్తులోనే.. మరలిరానిలోకాలకు
జారిపడి మృతిచెందిన కూలీలు

బొలెరో వ్యాన్‌ నుంచి పడి ఇద్దరు కూలీలు మృతి

ఉంగుటూరు, ఫిబ్రవరి 24 : అప్పటి వరకూ సాఫీగా సాగిపో తున్న ప్రమాదం.. అనుకోకుండా ఒక్క కుదుపు.. కళ్లు తెరిచేలోపే ఇద్దరు సజీ వంగా దూరమైన సంఘ టన ఉం గుటూరు మండలం నారాయణపురం వద్ద బుధవారం జరిగింది. చేబ్రోలు పోలీసుల కఽథనం ప్రకారం విశాఖ జిల్లా రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెద్దాపు రంలో వేరుశనగ పంట కోసేందుకు బొలేరో వాహనంలో మంగళవారం అర్ధరాత్రి బయలుదేరారు.వాహనంలో చాలాసేపు సరదాగా మాట్లాడుకుని నిద్రలోకి జారుకు న్నారు.ఉంగుటూరు –నారాయణపురం గ్రామాల మధ్య కల్వర్టు వద్ద వేగంగా వెళు తుండగా వెనుక డోరుకు ఉన్న గొలుసు ఒక్కసారిగా ఊడిపోయింది. అప్పటికే నిద్రమత్తులో ఉన్న ఆరుగురు కూలీలు ఒకరి వెంట మరొకరు వరుసగా కింద పడి పోయారు.ఈ సంఘటనలో అర్జాపురం గ్రామానికి చెందిన రాజన్న దేవుళ్ళు(35), యర్రంశెట్టి నూకరాజు(40) అక్కడికక్కడే మృతిచెందారు. యర్రంశెట్టి కొండలరావు, రాజాని శ్రీనివాసరావు, ఇలప శ్రీను, రాజాని తాతాలు గాయపడ్డారు.క్షతగాత్రులను తాడేపల్లి గూడెం ఏరియా అసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గణపవరం సీఐ డి.భగ వాన్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో చేబ్రోలు ఎస్‌ఐ ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు బంధువులకు సమాచారం అందించారు. 

Updated Date - 2021-02-25T05:07:55+05:30 IST