పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-10-22T14:47:25+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుగామన్ బ్రిడ్జి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుగామన్ బ్రిడ్జి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పశ్చిమ గోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాకు అక్రమంగా రేషన్ బియ్యం  తరలిస్తున్న 1 లారీ, 2 బొలెరో వాహనాలను అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఆరుగురుపై కేసు నమోదు చేశారు. దాదాపు 23 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేశారు. 

Updated Date - 2021-10-22T14:47:25+05:30 IST