AP: జంగారెడ్డిగూడెంలో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం

ABN , First Publish Date - 2021-11-05T14:19:24+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం చోటు చేసుకుంది.

AP: జంగారెడ్డిగూడెంలో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి.  విషయం తెలిసిన జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా వివాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-11-05T14:19:24+05:30 IST