శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-05T14:22:32+05:30 IST
పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుండి 14 వరకు సప్తాహ మహోత్సవములు జరుగనున్నాయి. కార్తీక మాసం తొలి రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.