Eluru: వ్యక్తిపై కత్తితో దాడి
ABN , First Publish Date - 2021-11-23T15:19:31+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మాదివాడకు చెందిన శెట్టిపల్లి గణేష్ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మాదివాడకు చెందిన శెట్టిపల్లి గణేష్ అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. గణేష్ కేకలు వేయటంతో నిందితులు పరారయ్యారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు వంగా విజయ్ కుమార్, మద్దిరాల పండుగా గుర్తించారు. పాతగొడవల నేపథ్యంలో కత్తితో దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.