AP: ద్వారకా తిరమల ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-31T13:58:27+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేపట్టారు.

AP: ద్వారకా తిరమల ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తుల ఆందోళన

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేపట్టారు. ఈవోని కలవాలంటూ సెక్యూరిటీ సిబ్బందితో విజయవాడకు చెందిన లక్ష్మణరావు, శివాజీ అనే ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. గతంలో శివాజీతో పాటు మరో ముగ్గురు తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివాజీ కేసు విషయాన్ని ఈవోతో మాట్లాడటానికి వచ్చామని లక్ష్మణరావు చెబుతున్నారు. తమను చూసి ఈవో భయపడి దాక్కున్నాడని  ఆరోపించారు. ద్వారకా తిరుమల ఈఓ పోస్ట్ కోసం శివాజీ తదితరులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు  ఇవ్వకుండా ఈవో ముఖం చాటేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈవో వ్యక్తిగత వ్యవహారాలతో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-31T13:58:27+05:30 IST