రఘురామకు అండగా మేముంటామంటూ అభిమానుల ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2021-05-18T16:20:41+05:30 IST

పెదఅమిరంలో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పేరిట ఫ్లెక్సీలు వెలసాయి.

రఘురామకు అండగా మేముంటామంటూ అభిమానుల ఫ్లెక్సీలు

ప.గో. జిల్లా: కాళ్ల మండలం, పెదఅమిరంలో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పేరిట ఫ్లెక్సీలు వెలసాయి. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా రఘురామకు అండగా ఉంటామంటూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 


కాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు మంగళవారం ఉదయం వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ అధికారిని నియమించింది. ప్రస్తుతం జ్యూడీషియల్ ఆఫీసర్ ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. రఘురామ కృష్ణం రాజుకు  ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షలు మొత్తాన్ని అధికారులు వీడియో తీస్తున్నారు.  మెడికల్ రీపోర్ట్స్ మొత్తం షీల్డ్ కవర్‌లో ఉంచి సుప్రీంకోర్టుకు అధికారులు సమర్పించనున్నారు. చికిత్స కాలాన్ని మొత్తం జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణం రాజును ఎవ్వరు కలవడానికి అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-05-18T16:20:41+05:30 IST