పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2020-05-28T15:50:12+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అత్తిలి మండలం మంచిలిలో బాలికపై పెంటయ్య అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలికకు మాయమాటలు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. అత్తిలి మండలం మంచిలిలో బాలికపై పెంటయ్య అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పూనుకున్నాడు. యువకుడు మంచిలిలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెంటయ్యపై అత్తిలి పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు.