ప.గో. జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2021-01-12T20:40:14+05:30 IST

ప.గో. జిల్లా: పాలకోడేరు మండలం, కుముదవల్లిలో విషాదం నెలకొంది.

ప.గో. జిల్లాలో విషాదం

ప.గో. జిల్లా: పాలకోడేరు మండలం, కుముదవల్లిలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న కుమారుడుతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన సీదే పరుశురాం(46), సావిత్రి(35), వారి కుమారుడు వెంకట శ్రీనివాసు(1)గా గుర్తించారు. ఈ దంపతులు ఇతరుల వద్ద అప్పు చేసి, అధిక వడ్డీకి హైమావతి అనే మహిళకు సుమారు రూ. 46 లక్షలు అప్పు ఇచ్చారు. ఆమె డబ్బుతో  పరారయ్యింది. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించక పరుశురాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వారి బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-12T20:40:14+05:30 IST