AP: ద్వారకా తిరుమలలో భారీ కొండచిలువ హల్చల్
ABN , First Publish Date - 2021-11-03T14:50:55+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో 8 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో 8 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. కుంకుళ్లమ్మ ఆలయం సమీపంలో రహదారి పక్కన కొండచిలువ స్థానికుల కంటపడింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాగా కొంత మంది యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి కర్రలతో కొండ చిలువను కొట్టి చంపారు.