విద్యార్థులకు విశ్రాంతి..!

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనలు, అను మతి లేకుండా సొంత అజెండాతో పాఠశాల స్థాయిలో కార్యక్రమం చేపట్టడంపై ఏలూరు డీవైఈవో డి.ఉదయ కుమార్‌కు బుధవారం షోకాజు నోటీసు జారీ చేసినట్టు డీఈవో సి.వి.రేణుక తెలిపారు.

విద్యార్థులకు విశ్రాంతి..!

ఏలూరు డీవైఈవోకు షోకాజు నోటీసు !

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 3: ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనలు, అను మతి లేకుండా సొంత అజెండాతో పాఠశాల స్థాయిలో  కార్యక్రమం చేపట్టడంపై ఏలూరు డీవైఈవో డి.ఉదయ కుమార్‌కు బుధవారం షోకాజు నోటీసు జారీ చేసినట్టు డీఈవో సి.వి.రేణుక తెలిపారు. తనకు లేని అధికారాలను తీసుకుని ‘విద్యార్థులకు అరగంట విశ్రాంతి’ అనే కార్యక్ర మంతో ప్రభుత్వం నిర్దేశించిన టైం టేబుల్‌కు అంత రాయం కలిగిస్తూ విద్యార్థులకు ‘అరగంట విశ్రాంతి’ అనే కార్యక్రమంతో ఉపాధ్యాయులను, విద్యార్థులను గందరగో ళానికి ఏలూరు డీవైఈవో గురిచేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోరాదో తెలియచేస్తూ రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ షోకాజు నోటీసు జారీ చేశామన్నారు.

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST