హుజురాబాద్ ఫలితాలపై భీమవరంలో భారీగా పందాలు
ABN , First Publish Date - 2021-11-02T17:38:08+05:30 IST
తెలంగాణ హుజూరాబాద్ ఎలక్షన్ కౌంటింగ్పై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీగా పందాలు జరుగుతున్నాయి.
ఏలూరు: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఎలక్షన్ ఫలితాలపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీగా పందాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుందని పందెం రాయుళ్లు బెట్టింగ్ కడుతున్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.