భూ సర్వే సమగ్రంగా చేపట్టండి : సిద్ధార్థ జైన్‌

ABN , First Publish Date - 2021-03-04T04:42:10+05:30 IST

భూ సర్వే సమగ్రంగా చేపట్టాలని.. ఎక్కడా అవకతవ కలకు తావివ్వద్దని సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ అన్నారు.

భూ సర్వే సమగ్రంగా చేపట్టండి : సిద్ధార్థ జైన్‌
అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌

పెదపాడు, మార్చి 3 : భూ సర్వే సమగ్రంగా చేపట్టాలని.. ఎక్కడా అవకతవ కలకు తావివ్వద్దని సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ అన్నారు. పెదపాడు తహసీల్దార్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ సమగ్ర భూ సర్వే కార్యక్రమంపై బుధవారం సమీక్షించారు. భూ సర్వే జరుగుతున్న తీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 డివిజన్లలో ప్రారంభమైన డ్రోన్‌ సర్వే తీరుతెన్నులు తెలుసుకున్నారు. సర్వే సిబ్బంది చేపట్టాల్సిన కార్యాచరణపై సూచ నలు చేశారు. కార్యక్రమంలో జేసీ వెంకట రమణారెడ్డి, ఆర్డీవో పనబాక రచన,  తహసీల్దార్‌ ఇందిరాగాంధీ, ఆర్‌ఐ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T04:42:10+05:30 IST