కరోనాను జయించడమే లక్ష్యం : ఎమ్మెల్యే గ్రంధి

ABN , First Publish Date - 2021-05-17T05:11:37+05:30 IST

ప్రస్తుతం మనమంతా కరోనాను జయిం చడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.

కరోనాను జయించడమే లక్ష్యం : ఎమ్మెల్యే గ్రంధి

భీమవరం, మే 16 : ప్రస్తుతం మనమంతా కరోనాను జయిం చడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి పలుశాఖల అధికారులకు ఫోన్‌ చేసి నియోజకవర్గంలో కరోనా కేసులపై చర్చించారు.ప్రతీఒక్కరూ విధిగా మాస్కు లు ధరించి, కనీసం మూడు మీటర్లు భౌతిక దూరం పాటించాలని, సబ్బుతో గాని, శానిటైజర్లతో గాని చేతులు శుభ్రం చేసు కోవాలన్నారు. కరోనాను జయించడంలో ముందుగా ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లుమీదకు రావొద్దని సూచించారు.పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్‌ ఆసుప త్రులకు సంబంధించి 230 వరకూ ఆక్సిజన్‌ బెడ్‌లున్నప్పటికీ సరిపోవడంలేదని, మరిన్ని బెడ్‌లను పెంచడానికి పట్టణంలో పలు ఆసుపత్రుల యాజ మాన్యాలతో చర్చిస్తున్నామన్నారు. కొవిడ్‌ ఆసుప త్రుల్లో గాని, క్వారంటైన్‌ కేంద్రంలో గాని వైద్యులు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు వైద్య సేవలందిస్తున్నారన్నారు.  


Updated Date - 2021-05-17T05:11:37+05:30 IST