ద్వారకా తిరుమలలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-10-15T13:54:49+05:30 IST
ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శుక్రవారం నుంచి అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ప.గో.జిల్లా: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు. 16న ధ్వజారోహణ, 18న ఎదుర్కొలు, 19 న స్వామివారి కల్యాణం, 20 న రథోత్సవం, 22 న స్వామివారి పవళింపుసేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో జివి సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.
కాగా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.