West Godavari జిల్లాలో సామాజిక వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-10-28T16:40:49+05:30 IST

కాళ్ల మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏలూరు పాడులో రాత్రి రెండు సామాజిక వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి

West Godavari జిల్లాలో సామాజిక వర్గాల మధ్య ఘర్షణ

పశ్చిమ గోదావరి: కాళ్ల మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏలూరు పాడులో రాత్రి రెండు సామాజిక వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు ఆస్పత్రి తరలించారు. ఘర్షణకు గల కారణం ఒక సామాజిక వర్గం యువకులు బైక్ పై వేగంగా వస్తూ..మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ఢీకొట్టారు. దీంతో యువకుడికి గాయాలయ్యాయి. ఎందుకు ఢీకొట్టారని అడిగినందుకు ఆ వర్గం యువకులు దాడి చేశారు. దాడి జరిగిన విషయాన్ని యువకుడు వారి వర్గానికి చెప్పడంతో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-28T16:40:49+05:30 IST