తూర్పులో రోడ్డు ప్రమాదం.. దువ్వ యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-17T05:56:32+05:30 IST
నాగుల్లంక శివారులో జరిగిన కారు ప్రమా దంలో తణుకు మండలం దువ్వకు చెందిన సరిదే మైఽథిలి రామ్కుమార్ మృతిచెందాడు.
పి.గన్నవరం, జనవరి 16:నాగుల్లంక శివారులో జరిగిన కారు ప్రమా దంలో తణుకు మండలం దువ్వకు చెందిన సరిదే మైఽథిలి రామ్కుమార్ మృతిచెందాడు. కృష్ణాజిల్లాకు చెందిన స్నేహితులతో కలిసి అతను సంక్రాం తికి మానేపల్లిలోని తన బంధువు గుడూరి అయ్యప్ప ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం అయ్యప్ప వారిని అల్పాహారం నిమిత్తం కారుపై గన్నవరం వెళ్లి ఇంటికి వస్తుండగా కందాలపాలెం వద్ద చెట్టును ఢీకొట్టారు. ప్రమా దంలో స్నేహితుడు ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందగా రామ్కుమార్ను కాకినాడ జీజీ హెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.