AP: ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-10-18T14:44:35+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.