ఏలూరులో చింతమనేని, పోలీసులకు మధ్య వాగ్వివాదం

ABN , First Publish Date - 2021-12-17T15:47:49+05:30 IST

టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యటు చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

ఏలూరులో చింతమనేని, పోలీసులకు మధ్య వాగ్వివాదం

ఏలూరు: టీడీపీ పోలవరం యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కిడికక్కడ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో దెందులూరులో ఇంటి నుంచి బయటకు వస్తున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. తాను పోలవరం వెళ్ళడం లేదని.. పెళ్ళికి వెళ్తున్నానని మాజీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం తరువాత చింతమనేనిని పోలీసులు వదిలారు. అయితే బయటకు వెళుతున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అనుసరిస్తున్నారు. 

Updated Date - 2021-12-17T15:47:49+05:30 IST