అభివృద్ధిలో టీడీపీది చెరిగిపోని ముద్ర : గన్ని

ABN , First Publish Date - 2021-02-25T05:11:28+05:30 IST

అభివృద్ధిలో టీడీపీ ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసిందని ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్య క్షుడు గన్ని వీరాంజనే యులు అన్నారు.

అభివృద్ధిలో టీడీపీది చెరిగిపోని ముద్ర : గన్ని
సమావేశంలో మాట్లాడుతున్న గన్ని వీరాంజనేయులు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 24 : అభివృద్ధిలో టీడీపీ ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసిందని ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్య క్షుడు గన్ని వీరాంజనే యులు అన్నారు.  స్థానిక మాగంటి కల్యాణ మండ పంలో బుధవారం పంచా యతీల్లో గెలిచిన సర్పంచ్‌ల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచిన స్థానాలకు అదే నిదర్శనమన్నారు.నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల బెదిరింపులను ప్రజలు, నాయకులు దీటుగా తిప్పికొట్టారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌ మాట్లాడుతూ రోబోయే ఎన్నికల్లో ప్రణా ళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లను అభినం దించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి, నాయకులు మద్దుకూరి ధనరాజు, శనగన శ్రీనివాస్‌, కిలపర్తి వెంకట్రావు, యెగ్గిన నాగ బాబు, దాసరి అప్పన్న, పరిమి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:11:28+05:30 IST