ఏలూరులో పెట్రోల్ బంక్ల వద్ద TDP నిరసన
ABN , First Publish Date - 2021-11-09T17:04:03+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల వద్ద నిరసనకు చేపట్టారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల వద్ద నిరసనకు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ ఏలూరు టీడీపీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ (చంటి)ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అదే పేపర్తో చెత్తను సేకరించే వాహనాన్ని తుడిచి కార్యకర్తలు నిరసన తెలిపారు.