వీరపేరంటాలు అమ్మవారి జాతర ప్రారంభం
ABN , First Publish Date - 2021-04-14T05:18:47+05:30 IST
శ్రీ వీరపేరంటాలు అమ్మవారి 68వ జాతర మహోత్సవాలు మంగళవారం వైభ వంగా ప్రారంభమ య్యాయి.
ఉండి, ఏప్రిల్ 13 : శ్రీ వీరపేరంటాలు అమ్మవారి 68వ జాతర మహోత్సవాలు మంగళవారం వైభ వంగా ప్రారంభమ య్యాయి. వివిధ ప్రాం తాలు నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్ద కలశస్థాపనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేళ తాళాలు, గరగల నాట్యం, బుట్టబొమ్మలు, విచిత్ర వేషఽధారణలతో ఉత్సవాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి సేవ–జాతర జరిగింది. ఆలయకమిటి మాజీ చైర్మన్ మంతెన రంగరాజు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.