మొత్తం ఓటర్లు 33,00,625
ABN , First Publish Date - 2021-01-16T06:24:36+05:30 IST
జిల్లాలో ఓటర్ల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది.
తుది జాబితా విడుదల
కొత్త ఓటర్లు 52,510.. మహిళా ఓటర్లదే పైచేయి
జిల్లాలో మహిళా ఓటర్లు 16,80,745
పురుష ఓటర్లు 16,19,584... ఇతరులు – 295
ఏలూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఓటర్ల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. ఈ ఏడాది కొత్తగా 52,510 మంది ఓటు హక్కు పొందారు. ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముత్యాలరాజు శుక్రవారం విడుదల చేశారు. డిసెంబరులో విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్య 32,59,135 కాగా చివరి నెలలో దాదాపు 40 వేల మంది ఓటు హక్కు పొందడం విశేషం. తాజా జాబితాలో కూడా మహిళలదే పైచేయి. మొత్తం 33,00,625 ఓటర్లలో 16,19,584 మంది పురుష ఓటర్లు ఉండగా మహిళలు 16,80,745 మంది ఉన్నారు. 295 మంది ట్రాన్స్జెండర్లు, 1,773 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
కొవ్వూరు 89,145 93,531 10 1,82,686
నిడదవోలు 1,02,071 1,05,474 7 2,07,552
ఆచంట 89,461 91,179 3 1,80,643
పాలకొల్లు 96,885 1,00,018 13 1,96,916
నరసాపురం 86,544 87,756 1 1,74,301
భీమవరం 1,23,129 1,29,459 102 2,52,690
ఉండి 1,11,411 1,14,868 12 2,26,291
తణుకు 1,16,581 1,22,092 8 2,38,681
తాడేపల్లిగూడెం 1,05,375 1,09,705 16 2,15,096
ఉంగుటూరు 1,01,734 1,03,774 8 2,05,516
దెందులూరు 1,10,726 1,14,609 9 2,25,344
ఏలూరు 1,13,891 1,25,389 37 2,39,317
గోపాలపురం 1,17,734 1,19,777 13 2,37,524
పోలవరం 1,21,851 1,28,103 14 2,49,968
చింతలపూడి 1,33,046 1,35,012 42 2,68,100
మొత్తం 16,19,584 16,80,746 295 33,00,625
కొత్తగా దరఖాస్తు చేసుకున్న సమయం: నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు
ప్రత్యేక ప్రచార తేదీలు : నవంబరు 28,29 ; డిసెంబరు 12,13
తుది ఓటర్ల జాబితా: జనవరి 15