ఆకివీడులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన YCP

ABN , First Publish Date - 2021-11-10T19:09:32+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో అధికార వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు.

ఆకివీడులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన YCP

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో అధికార వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఆకివీడులో  దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ  కౌన్సిలర్ అభ్యర్థులతో మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణమండపంలో గంటన్నరపైగా సమీక్ష సమావేశం  జరిగింది. మంత్రి, ఎమ్మెల్యేల వాహనాలను రోడ్లపైనే నిలపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2021-11-10T19:09:32+05:30 IST