శివరాత్రి ఉత్సవాల కు ఏర్పాట్లు చేయండి : జిల్లా ఎస్పీ నారాయణ్‌ నాయక్‌

ABN , First Publish Date - 2021-03-04T05:28:43+05:30 IST

పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు.

శివరాత్రి ఉత్సవాల కు ఏర్పాట్లు చేయండి : జిల్లా ఎస్పీ నారాయణ్‌ నాయక్‌
బోటులో పట్టిసీమ వెళుతున్న ఎస్పీ

పోలవరం, మార్చి 3 : పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టిసీమ శివక్షేత్రాన్ని సందర్శించిన ఆయన తొలుత భద్రకాళి సమేత వీరేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు నది దాటడానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలవరం డీఎస్పీ లతాకుమారి, సీఐ అల్లు నవీన్‌ నరసింహమూర్తి, ఆలయ ఈవో యూవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T05:28:43+05:30 IST