ఏలూరు కోర్టు ఉద్యోగులకు కరోనా

ABN , First Publish Date - 2022-01-24T05:06:02+05:30 IST

ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న వివిధ రకాల కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు, ప్రాక్టీసు చేసే న్యాయవాదుల్లో కొంత మందికి కరోనా సోకింది.

ఏలూరు కోర్టు ఉద్యోగులకు కరోనా

ఏలూరు క్రైం, జనవరి 23 : ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న వివిధ రకాల కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు, ప్రాక్టీసు చేసే న్యాయవాదుల్లో కొంత మందికి కరోనా సోకింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో ఇప్పటికే వర్చువల్‌ ద్వారా కేసులు వాదిస్తున్నారు. ఇటీవల కొన్ని కోర్టుల్లోని సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈనెల 22వ తేదీన ప్రాథమిక లక్షణాలు కలిగిన పలువురికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. కోర్టు ఉద్యోగుల్లో కొంతమందికి, న్యాయవాదుల్లో కొంతమందికి మొత్తం 51 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో జిల్లా జడ్జి భీమారావు ఆదేశాల మేరకు ఏలూరు బార్‌ అసోసియేషన్‌ భవనాన్ని వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్టు బార్‌ ప్రధాన కార్యదర్శి మాండ్రు రాజేంద్ర సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2022-01-24T05:06:02+05:30 IST